పశువుల‌ను పూజించే గొప్ప సంస్కారం మనది: సదర్ సమ్మేళనంలో భేరి రాంచందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: హైదరాబాద్ నారాయణగూడ లో దీపావళి పండగ‌ను పురస్కరించుకుని యాదవులు అత్యంత వైభవంగా‌‌ జరుపుకునే సదర్ సమ్మేళన్ మహోత్సవంలో అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు భేరీ రామచందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువులను పూజించే గొప్ప సంస్కారం మనదని అన్నారు. సదర్ పండగ అన్ని వర్గాల వారి ఐకమత్యానికి నిదర్శనం అన్నారు. వి. పాండు యాదవ్, వినోద్ యాదవ్, బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్, మల్లేష్ యాదవ్, రాజు యాదవ్, అశోక్ యాదవ్, లడ్డూ యాదవ్ ల ఆధ్వర్యంలో దున్నపోతుల ఆటలు అందరిని ఆకట్టుకున్నాయని అన్నారు. బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి మాగంటి సుధాకర్ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ యువజన విభాగం నాయకులు పూలపల్లి యాదగిరి యాదవ్, అందెల భేరీ చంద్రశేఖర్ యాదవ్, లవణ్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం రామచంద్రపురం సదర్ మహోత్సవంలో భేరీ రామచందర్ యాదవ్ పాల్గొన్నారు. గోకుల్ శ్రీధర్ యాదవ్, పాములేటి యాదవ్, శివ యాదవ్, వెంకట్ రాజు యాదవ్, అందెల కుమార్ యాదవ్, ఆర్ సి పురం మహంకాళి విశ్వ కర్మ అధ్యక్షులు కృష్ణమూర్తి చారి, ఆర్ సి పురం సదర్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here