59వ జాతీయ చాంపియన్ షిప్ పోటీలో పీజేఆర్ స్టేడియం క్రీడాకారులకు రజత పతకం

నమస్తే శేరిలింగంపల్లి: రోలర్ స్కేటింగ్ 59వ జాతీయ చాంపియన్ షిప్ పోటీలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ చందానగర్ పీజేఆర్ స్టేడియం క్రీడాకారులు ప్రతిభ చాటారు. ఈ నెల 11 నుంచి 21 వ తేదీ వరకు‌ పంజాబ్ లోని మొహాలీలో 59 వ జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీలో చందానగర్ పీజేఆర్ స్టేడియం లో శిక్షణ పొందిన క్రీడాకారులు తర్పణ శ్రీ యల్లా, యు. హరిణి లు రజత పతకం సాధించారు. హర్యానా- తెలంగాణ జట్టుల మధ్య సబ్ జూనియర్ బాలికల ఫైనల్స్ లో 2-1 స్కోర్ తేడాతో ఆట ముగిసింది‌. ఈ‌ పోటీలో తెలంగాణ రాష్ట్రానికి రజత పతకం దక్కింది. రజత పతకం సాధించిన క్రీడాకారులకు పలువురు అభినందనలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here