రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

చందానగర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ కాలనీలో సుమారుగా రూ.50 లక్షల అంచనవ్యయంతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ దీప్తి శ్రీనగర్ కాలనీ ప్రధాన రహదారిని విస్తరించడం వల్ల‌ ట్రాఫిక్ సమస్య తగ్గుతుంద‌న్నారు. దీంతో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌న్నారు. రోడ్డు విస్త‌ర‌ణ పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని అన్నారు. ప్రజలకు ట్రాఫిక్ రహిత, సుఖవంతమైన ర‌వాణా స‌దుపాయాల‌ను అందిస్తామ‌ని తెలిపారు. ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేసి రోడ్డును ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తేవాల‌న్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు మాధవరం గోపాల్, వెంకట్ పాల్గొన్నారు.

రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here