రాజ్‌కుమార్ యాదవ్ జయంతిని పురస్కరించుకుని వృద్ధులకు పండ్లు పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ సభ్యులు బిక్షపతి యాదవ్ కుమారుడు మారబోయిన రాజ్ కుమార్ యాదవ్ జయంతిని పురస్కరించుకుని వివేకానంద సేవా సంఘం ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆర్‌కేవై టీం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గుండె గ‌ణేష్ ముదిరాజ్ మాట్లాడుతూ రాజ్‌కుమార్ యాద‌వ్ చిన్న‌త‌నంలో త‌నువు చాలించ‌డం బాదాక‌ర‌మ‌ని అన్నారు. వారి జ‌న్మ‌దిన వేళ వృద్ధుల‌కు తోచిన సేవ చేసుకోవ‌డం ఎంతో సంతృప్తిని ఇచ్చింద‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయ‌కులు ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, గంగారం మల్లేష్, జాజిరావు శీను, రేపాన్ వెంకటేష్, జాజిరావు రాము, సోను కుమార్ యాదవ్, అంగన్, రాజేందర్, గోపి నరేష్ చారీ, దుర్గేష్, ఆర్ కే వై కే టీం సభ్యులు పాల్గొన్నారు.

వృద్ధులకు పండ్లను పంపిణీ చేస్తున్న ‌ఆర్ కె‌ వై టీం సభ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here