నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ సభ్యులు బిక్షపతి యాదవ్ కుమారుడు మారబోయిన రాజ్ కుమార్ యాదవ్ జయంతిని పురస్కరించుకుని వివేకానంద సేవా సంఘం ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్కేవై టీం ప్రధాన కార్యదర్శి గుండె గణేష్ ముదిరాజ్ మాట్లాడుతూ రాజ్కుమార్ యాదవ్ చిన్నతనంలో తనువు చాలించడం బాదాకరమని అన్నారు. వారి జన్మదిన వేళ వృద్ధులకు తోచిన సేవ చేసుకోవడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, గంగారం మల్లేష్, జాజిరావు శీను, రేపాన్ వెంకటేష్, జాజిరావు రాము, సోను కుమార్ యాదవ్, అంగన్, రాజేందర్, గోపి నరేష్ చారీ, దుర్గేష్, ఆర్ కే వై కే టీం సభ్యులు పాల్గొన్నారు.