బండి సంజయ్ పాదయాత్ర ప్రచార ప్రతినిధిగా మునికుంట్ల రాజేష్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈ నెల 24 నుంచి పాదయాత్ర చేపట్టనున్న విషయం విధితమే. ఐతే పాదయాత్ర నిర్వహణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటయింది. మొత్తం 29 విభాగాలకు ప్రతినిధుల పేర్లు రాష్ట్ర పార్టీ ప్రకటించింది. తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మునికుంట్ల రాజేష్ రెడ్డి పాదయాత్ర ప్రచార కమిటీ ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాజేష్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, యాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్ రెడ్డి, సహ ప్రముఖులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పాదయాత్ర విజయవంతం కొరకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు. పాదయాత్ర విశేష ప్రాచుర్యం పొందేలా ప్రచారం నిర్వహణ చేపడతామని అన్నారు.

బండి సంజయ్ మునికుంట్ల రాజేష్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here