శేరిలింగంపల్లి, మే 17 (నమస్తే శేరిలింగంపల్లి): బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రవి కుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నగర్ లోని కార్పొరేటర్ కార్యాలయం వద్ద బీజేపీ ప్రజా ప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకుల, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి రవి కుమార్ యాదవ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ గచ్చిబౌలి డివిజన్ బీజేపీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు.
అనంతరం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ రవి కుమార్ యాదవ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక స్పష్టమైన దిశా నిర్దేశకులుగా ఎదుగుతున్నారు. ప్రజల సమస్యల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధి, పార్టీ అభివృద్ధి పట్ల ఆయన చూపించే నిబద్ధత ఈ తరం నాయకులకు ఆదర్శంగా నిలుస్తుంది. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని పేర్కొన్నారు. పలువురు నేతలు కూడా రవి కుమార్ యాదవ్ నాయకత్వ లక్షణాలను కొనియాడుతూ, ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు. రవి కుమార్ యాదవ్ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, యువకులు, అభిమానులు పాల్గొన్నారు.