వివేకానందనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వివేకానందనగర్ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ స్థానిక బీజేపీ నాయకుడు ఉప్పల ఏకాంత్ గౌడ్ సతీమణి ఉప్పల విద్యా కల్పన ఏకాంత్ గౌడ్ సోమవారం పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ అధ్యక్షుడు పన్నాల హరీష్ చంద్ర రెడ్డికి వినతిపత్రం, బయోడేటాలను అందజేశారు. తనకు కార్పొరేటర్గా పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తే గెలిచేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. డివిజన్ పరిధిలో ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామని వివరించారు. కార్పొరేటర్గా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి నాయకులు చౌదరి ధర్మారావు, ఉప్పల ఏకాంత్ గౌడ్ పాల్గొన్నారు.

