నాలాల విస్త‌ర‌ణ‌తో లోత‌ట్టు ప్రాంతాల‌కు ఉప‌శ‌మ‌నం : PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 24 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు డివిజన్లలో H-CITI, SNDP ఫేస్- 2 లో భాగంగా మంజూరైన నాలాల విస్తరణ పనులపై శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, SNDP విభాగం CE కోటేశ్వరరావు, అధికారులు, GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ SNDP ఫేస్ 2 లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రూ.79 కోట్ల 58 లక్షలతో నాలాల విస్తరణ పనులు చేపట్టడంతో ఎన్నో ఏండ్ల వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నాలాల విస్తరణ పనులతో లోతట్టు, ముంపు ప్రాంతాలకు ఉపశమనం లభించింద‌ని ప్రజా అవసరాల దృష్ట్యా ప్రథమ ప్రాధాన్యతలో విస్తరణ పనులు చేపట్టాలని, నాలాల విస్తరణ పనులలో వేగం పెంచాలని, యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించాలని అధికారులకు తెలియచేశారు.

స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హిస్తున్న PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

ఈ కార్యక్రమంలో SNDP అధికారులు CE కోటేశ్వరరావు, SE భాస్కర్ రెడ్డి, DE రాజు, DE వశిధర్, AE వెంకటేష్, AE మహేందర్ రెడ్డి, AE యుగంధర్, GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు SE శంకర్ నాయక్, EE GK దుర్గప్రసాద్ , EE KVS రాజు, DE ఆనంద్, DE దుర్గాప్రసాద్ ,DE విశాలాక్షి, DE శ్రీదేవి, AE ప్రశాంత్,AE ప్రతాప్, AE జగదీష్ ,AE రషీద్, AE సంతోష్ రెడ్డి,AE సంతోష్, DE స్ట్రీట్ లైట్స్ కవిత, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here