నమస్తే శేరిలింగంపల్లి: వరల్డ్ రెడ్ క్రాస్ డే వేడుకలను పురస్కరించుకొని చందా నగర్ లోని జిహెచ్ఎంసి కళ్యాణ మండపంలో శనివారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రోటోడైన్ సంస్థ సౌజన్యంతో నిర్వహించిన ఈ శిబిరంలో 20 మందికి పైగా దాతలు తమ రక్తాన్ని దానం చేశాను. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చందానగర్ సర్కిల్ ఉప కమిషనర్ సుధాంష్ నందగిరి మాట్లాడుతూ కరుణ విలయతాండవం చేస్తున్న వేళ రక్త నిల్వలు లేక రోగులు అవస్థలు పడుతున్నారని, ఈ క్రమంలో ఇలాంటి శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఉప వైద్యాధికారి డాక్టర్ కార్తీక్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా చైర్మన్ ఎస్.నరసింహారెడ్డి, వైస్ చైర్మన్ వీ పాండు, రోటోడైన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత కె.మధుసూదన్ రెడ్డి వారి సిబ్బంది పాల్గొన్నారు.






