శేరిలింగంపల్లి, మే 3 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నూతన జోనల్ కమిషనర్ హేమంత్ తో భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించడంతో ఆయనను కలిసిన రవీందర్ యాదవ్ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజవకర్గంలోని పలు సమస్యలను ఆయనకు వివరించినట్లుగా వెల్లడించారు. శేరిలింగంపల్లి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను కమిషనర్ కు రవీందర్ యాదవ్ తెలిపారు. నియోజకవర్గం గురించి ఇద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగింది. శేరిలింగంపల్లి కమిషనర్ గా హేమంత్ రావడంతో అభివృద్ధి వేగంగా సాగుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. అలాగే సమావేశంలో పలు డివిజన్ లలో చేపట్టాల్సిన పనులను, ప్రజలకు ఉన్న సమస్యలను వివరించారు. వాటిపై త్వరలోనే అధికారులతో సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారని రవీందర్ యాదవ్ వెల్లడించారు.