శేరిలింగంపల్లి, మే 17 (నమస్తే శేరిలింగంపల్లి): బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా హఫీజ్పేట్ డివిజన్ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో దీప్తి శ్రీనగర్ లో ఉన్న శ్రీ శిరిడి సాయి ఓల్డ్ ఏజ్ హోమ్ లోని వృద్ధులకు భోజన వసతి కల్పించారు. రవికుమార్ యాదవ్ జన్మదిన వేడుకలను వృద్ధాశ్రమంలో నిర్వహించి కేక్ కట్ చేసి మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాగులు గౌడ్, మహేష్ యాదవ్, అశోక్, రవి, శ్రీనివాస్, గణేష్, రాము, జితేందర్, రవి గౌడ్, బాలాజీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.