శేరిలింగంపల్లి, మే 17 (నమస్తే శేరిలింగంపల్లి): బీపీ మండల్ సిఫారసుల సాధననే ప్రతి ఒక్కరి లక్ష్యం అవ్వాలని తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ అన్నారు. బీపీ మండల్ సిఫారసులపై పోరాడేందుకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మద్దతును ఆయన కోరారు. ఈ సందర్భంగా భేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ పార్టీలకతీతంగా, కులమతాలకు అతీతంగా మండల్ డే జరుపుకుందాం అని అన్నారు. ముఖ్యంగా బీసీల ఆరాధ్య దైవమైన బిందెశ్వర్ ప్రసాద్ మండల్ ఆగస్టు 7న మండల్ డే గా ప్రకటించుకుని ఉద్యమం చేద్దామని, 8 వారాలపాటు బీపీ మండల్ జ్ఞాపకార్థం వారోత్సవాలు జరుపుకుంటూ ఉద్యమం చేసి మండల్ సిఫార్సు చేసిన 40 అంశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని రాతపూర్వకంగా విజ్ఞప్తి చేద్దామని అన్నారు.
బీసీ ఐక్యవేదిక సలహాదారు ఆర్కే సాయన్న ముదిరాజ్ బీసీ ఐక్యవేదిక సలహాదారు సలహా ప్రకారం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు రాతపూర్వకంగా విజ్ఞప్తి చేద్దామని కార్యవర్గం నిర్ణయించడం జరిగిందన్నారు. పార్టీలకతీతంగా కులమతాలకతీతంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం స్ఫూర్తిగా తీసుకొని సామాజిక ఉద్యమమైన బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసి అధికారమే అంతిమ లక్ష్యంగా మండల్ 40 అంశాల అమలు కొరకు బీసీలు అందరిని కలుపుకొని ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ బహుజనుల మద్దతుతో రాజ్యాధికారం సాధిద్దామని పిలుపునిచ్చారు. శ్రీనివాస్ గౌడ్ ను కలిసిన వారిలో బేరి రామచంద్ర యాదవ్, తెలంగాణ ఉద్యమ నాయకుడు రాజారాం యాదవ్, మేదర సంఘం వెంకట్, పద్మశాలి కృష్ణ, రజక సంఘం రమేష్, నాయి బ్రాహ్మణ సంఘం కుమార్, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్ని కులాలకు చెందిన నాయకులు ఉన్నారు.