ఢిల్లీలో బండి సంజయ్ ను కలిసిన రవికుమార్ యాదవ్, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ను ఢిల్లీ లోని ఆయన కార్యాలయంలో బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాదర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. న్యూఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు, రాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా ఢిల్లీకి విచ్చేసిన సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కలిశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. శేరిలింగంపల్లి ‌లోని పార్టీ స్థితిగతులను బండి సంజయ్ కు వివరించారు. 2023 తెలంగాణ రాష్ట్రంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కలిసిన రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here