శేరిలింగంపల్లి, జనవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): సంక్రాతి పర్వదిన ఉత్సవాలలో భాగంగా యువనాయకుడు ధాత్రీనాథ్ గౌడ్ NMG ట్రస్ట్ ఆధ్వర్యంలో జనప్రియ అపార్టుమెంట్స్ ఫేజ్ -1 సాయిబాబా మందిరం ఆవరణలో ముగ్గుల పోటీ నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు, అలాగే పోటీలో పాల్గొన్న పోటీదారులందరికీ ప్రోత్సాహక బహుమతులను ధాత్రీనాథ్, ఆయన సతీమణి సింధు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జనప్రియ అపార్టుమెంట్స్ ఫేజ్ -1 ప్రెసిడెంట్ ప్రవీణ్ గౌడ్ , శ్రీనివాస్, హరికృష్ణ, మృదుల, సుచిత్ర తదితరులు పాల్గొన్నారు.






