ముస్లింల‌కు రంజాన్ శుభాకాంక్ష‌లు… కోవిడ్‌ నిబంధ‌న‌లు పాటిస్తూ పండుగ జ‌రుపుకోవాలి: ప్ర‌భుత్వ విప్ గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ ముస్లిం మైనారిటీలంద‌రికి ప్ర‌భుత్వ విప్, శేరిలింగంప‌ల్లి శాస‌న‌స‌భ్యులు ఆరెక‌పూడి గాంధీ రంజాన్‌ పర్వదిన శుభాకాంక్షలు తెలియచేశారు. ముస్లిం సోదరులందరు కుటంబ సభ్యులతో కోవిడ్ నిబంధనలకు లోబడి పండుగ జరుపుకోవాలని, క‌రోనాను పార‌ద్రోలేనా అల్లాను ప్రార్ధించాల‌ని కోరారు. కోవిడ్ భూతంతో స‌మ‌స్త మాన‌వాళి అత‌లాకుతం అవుతున్న నేప‌థ్యంలో అల్లా కృప‌తో త్వ‌ర‌లోనే ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌లంతా క‌రోనా విముక్తితో సంతోషంగా జీవించాల‌ని కోరుకుంటున్న‌ట్టు తెలిపారు. ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకువ‌చ్చింద‌ని, మానిఫెస్టోలో లేని అంశాలను సైతం ప్రవేశపెట్టి ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ క‌ట్టుబ‌డి ఉన్నార‌న్నారు. షాదిముబారక్ పథకం ద్వారా ప్రతి పేదింటి ముస్లిం ఆడపిల్లకు రూ.1,00,116 ఇవ్వడం జరుగుతుందని, మైనారిటీ గురుకుల పాఠ‌శాల‌ల‌ను ప్రారంభించడం జరిగంద‌న్నారు. మైనారిటీల సంక్షేమానికి పెద్ద‌పీట వేస్తున్న ప్రభుత్వం అల్లా ద‌య‌తో ప‌దికాల‌ల పాటు ప‌దిలంగా ఉండేలా ఆకాంక్షించారు.

ప్ర‌భుత్వ విప్, శేరిలింగంప‌ల్లి శాస‌న‌స‌భ్యులు ఆరెక‌పూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here