సిద్దిఖ్ నగర్ లో రంజాన్ తోఫాలను అందజేసిన‌ కార్పొరేటర్ హమీద్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి: కులమతాలకు అతీతంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. కొండాపూర్ డివిజన్ సిద్దిఖ్ నగర్ లోని ఫాతిమాతు జోహారా మసీదులో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రతి వర్గానికి, మతానికి సరైన ప్రాధాన్యతను ఇస్తూ, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. పేద ప్రజలు పండుగలు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో దసరా, క్రిస్మస్, రంజాన్ పండగలకు సీఎం కేసీఆర్ కొత్త బట్టలను కానుకలుగా అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇమామ్, సలీం ముల్సబ్, మౌసం, జాఫర్ ముల్సబ్ తదితరులు ఉన్నారు.

సిద్దిఖ్ నగర్ లో రంజాన్ తోఫాలను అందజేస్తున్న కార్పొరేటర్ హమీద్ పటేల్

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here