నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ వేమన వీకర్ సెక్షన్ బస్తీలో నర్సింహా అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న చందానగర్ మాజీ కార్పొరేటర్, బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ బొబ్బ నవతా రెడ్డి నర్సింహా మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తంపరిచారు. దహన సంస్కారాల కోసం బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్ధిక సహాయం అందజేసి నవతారెడ్డి తన ఔదార్యాన్ని చూపించారు.