శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని కొండాపూర్ మసీదుబండలో రాజ్ కుమార్ యాదవ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజ్ కుమార్ యాదవ్ మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహించనున్నారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో జరగనున్న ఈ టోర్నమెంట్లో విజేతలకు మొదటి బహుమతి కింద రూ.20వేలు, రెండో బహుమతిగా రూ.10వేలు, మూడో బహుమతి కింద రూ.5వేల నగదును అందివ్వనున్నారు. ఈ టోర్నమెంట్లో ఎవరైనా పాల్గొనవచ్చని, ఎంట్రీ ఫీజు లేదని, కేవలం జూనియర్ ప్లేయర్లే పాల్గొనాల్సి ఉంటుందని రాజ్ కుమార్ యాదవ్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.దేవేందర్ యాదవ్ తెలిపారు. మరిన్ని వివరాలకు పి.సురేష్ యాదవ్, సీహెచ్ కృష్ణ గౌడ్లను 8247712193, 9676635533 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.