మైత్రి నగర్, హఫీజ్ పేట్ ల‌లో రామ మందిర నిర్మాణ నిధి సేక‌ర‌ణ

హ‌ఫీజ్‌పేట‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామమందిర నిర్మాణం కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రారంభమైన “శ్రీరామ జన్మ భూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ “లో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మైత్రి నగర్, హఫీజ్ పేట్ ప్రాంతాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జ్ఞానేంద్ర ప్రసాద్, సంఘ్ పరివార్ పెద్దలు రమణా రెడ్డి, భూషణ్, గురు కొత్త, కృష్ణా రెడ్డి, కోటేశ్వరరావులు ఇంటింటికీ జన జాగరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వారు ప్రముఖ వ్యాపారస్తులను కలిశారు. ఈ క్ర‌మంలో స్పందించిన పిసిఆర్ ప్రైమ్ చెన్నా రెడ్డి రూ.1,08,116లను, హఫీజ్ పేట్ కు చెందిన నరహరి పటేల్ రూ.25,116 లను, బిల్డర్ కుటుంబ రావు రూ.11,116 లను రామ జన్మభూమి మందిరానికి నిధిగా సమర్పించారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యాపారస్తుడు, బిల్డర్, ఇతరులు రామ జన్మభూమి మందిర నిర్మాణానికి ముందుకు రావడం శుభదాయకం అని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరికీ ఆ శ్రీరాముడి ఆశీర్వాదాలు కలగాలని అన్నారు.

రామ మందిర నిర్మాణానికి నిధి అంద‌జేస్తున్న పిసిఆర్ ప్రైమ్ చెన్నా రెడ్డి
రామ మందిర నిర్మాణానికి నిధి అంద‌జేస్తున్న నరహరి పటేల్
రామ మందిర నిర్మాణానికి నిధి అంద‌జేస్తున్న బిల్డర్ కుటుంబ రావు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here