ప్రభుత్వ విప్ గాంధీని కలిసిన రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్‌ నూతన కార్యవర్గం

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు ప్రభుత్వ విప్ గాంధీ శుభాకాంక్షలు తెలిపి‌ అభినందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కాలనీ లో అన్ని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. నూతన కార్యవర్గ సభ్యులు కాలనీ వాసులందరికి ఎల్లవేళల అందుబాటులో ఉంటూ కాలనీ సమస్యల పై స్పందిస్తూ సమిష్టిగా కాలనీ అభివృద్ధి కి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు జూపల్లి, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్, సెక్రటరీ సురేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ రేణుక, సౌజన్య, ట్రెజరర్ రాం మూర్తి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ప్రమీల, ఏసప్ప, రమాదేవి, పుల్లారెడ్డి, ప్రకాష్ రావు, సీతారత్నం, సురేష్, రజినీకాంత్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గాంధీని కలిసిన రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ నూత‌న కార్యవర్గం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here