అభివృద్ధి ప‌నుల్లో నాణ్య‌త‌ను పాటించాలి: ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని భాను టౌన్ షిప్ లో రూ. 30 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను అర్థరాత్రి ఆకస్మికంగా వెళ్లి తెల్లవారుజాము వరకు అక్కడే ఉండి PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ శేరిలింగంప‌ల్లిని నంబ‌ర్ వ‌న్ నియోజ‌క‌వర్గంగా మార్చ‌డ‌మే ల‌క్ష్య‌మని అన్నారు. ప్ర‌తి బ‌స్తీ, కాల‌నీలో మౌలిక స‌దుపాయ‌ల క‌ల్ప‌నే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నామ‌న్నారు. ఎక్క‌డ ఎలాంటి స‌మ‌స్య ఉన్నా ప్ర‌జ‌లు త‌న దృష్టికి తీసుకువ‌స్తే వెంట‌నే ప‌రిష్క‌రించేందుకు కృఫి చేస్తాన‌న్నారు. ఈ కార్యక్రమంలో భాను టౌన్ షిప్ ప్రెసిడెంట్ షరీఫ్, వైస్ ప్రెసిడెంట్ ఇలియాస్, జనరల్ సెక్రటరీ రంగ‌నాథ్, భీం రావు, పవన్ గౌడ్, అమర్ దీప్, అశోక్, మక్బుల్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు నిర్మాణ పనుల‌ను ప‌రిశీలిస్తున్న ఎమ్మెల్యే గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here