శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని పాపిరెడ్డి నగర్ లో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానికవాసులతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రోడ్డుకు అడ్డుగా ఉన్న అరువులను, ర్యాంపులను తొలగించి రోడ్డు వెడల్పు కోసం స్థానికవాసులు అధికారులకు, కాంట్రాక్టర్లకు సహకరించాలని సూచించారు.






