పుల్వామ అమ‌ర‌వీర జ‌వాన్ల‌కు ఆయువ్ ఘ‌న నివాళీ

చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పుల్వామా దాడిలో మృతి చెందిన అమ‌రీ వీర జ‌వానుల‌కు ఆయువ్ స్టూడెంట్ యూత్ ఫౌండేష‌న్ ఘ‌న నివాళుల‌ర్పించింది. హుడా కాల‌నీ క‌మ్యూనిటీ హాల్‌లో అమ‌ర వీర జ‌వానుల చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పించిన ఫౌండేష‌న్ స‌భ్యులు కొవ్వ‌త్తులు వెలిగించి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. ఈ సంద‌ర్భంగా ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కులు రోషిత్ ముదిరాజ్ మాట్లాడుతూ శ‌తృవుల దొంగ దెబ్బ‌లో అమ‌రులైన‌ జ‌వానుల ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్ధించారు. ఈ కార్య‌క్రమంలో ఫౌండేష‌న్ ఉపాధ్య‌క్షులు చ‌ర‌ణ్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాజేష్‌, కోశాధికారి భాను ముదిరాజ్‌, స‌భ్యులు చందు, సంతు, అఖిల్‌, బాల‌కృష్ణ‌, గౌరి, వ‌సంత్‌, ముర‌ళీ, ల‌క్ష్మ‌న్‌, విన‌య్‌, క‌లీమ్‌, చందు, చ‌ర‌ణ్ గౌడ్‌, కిర‌ణ్ గౌడ్‌, శ్ర‌వ‌ణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

పుల్వామ అమ‌ర వీర జ‌వాన్ల చిత్ర ప‌టాల‌కు నివాళుల‌ర్పిస్తున్న ఆయువ్ ఫౌండేష‌న్ స‌భ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here