శేరిలింగంపల్లి, మార్చి 7 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక రెండవ రోజులో భాగంగా శేరిలింగంపల్లిలోని మియాపూర్ డీకే ఎన్క్లేవ్లో ఉన్న పార్కుల్లో శుభ్రతా చర్యలను చేపట్టారు. స్థానిక ప్రొఫెసర్ జయశంకర్ ట్రీ పార్కులో పారిశుధ్య సిబ్బంది చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా పార్కులోని గ్రీన్ వేస్ట్ ను తొలగించడంతోపాటు శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, పారిశుధ్య అధికారి, Sfa లు వినయ్, ఆగమయ్య, కార్మికులు పాల్గొన్నారు.






