పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి సామగ్రి అంద‌జేత

శేరిలింగంప‌ల్లి, జూన్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ ఇందిరానగర్‌లో ఉన్న ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, స్లేట్లు, పెన్సిళ్లను సామాజిక కార్యకర్త కట్ల శేఖర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన విద్యా సామగ్రిని అందించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు విద్యా సామగ్రి అందించడం వారి చదువుకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి విద్యా సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు పుస్తకాలు, ఇతర విద్యా పరికరాలు అందించడం వారి విద్యాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు నర్సింగ్ రావు, చంద్ర మౌళి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here