కూకట్ పల్లి (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (టీఎస్ఈఈ) సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ సమక్షంలో సోమవారం భోజన విరామ సమయంలో కూకట్ పల్లి, కొండాపూర్ డివిజన్ ఆఫీస్ ఆవరణలో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్, టీవీడబ్ల్యూ బి-2871 యూనియన్, సీఐటీయూల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. పెండింగ్లో ఉన్న విద్యుత్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఈఈ యూనియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కె. వెంకటేశ్వర్లు, సైబర్ సిటీ సర్కిల్ సెక్రెటరీ హెచ్ శ్యామ్ సుందర్, టీవీడబ్ల్యూ బి-2871 యూనియన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ ఖమర్, సీఐటీయూ పరుశురాం, గచ్చిబౌలి డివిజన్ ప్రెసిడెంట్ వై. వెంకట రామిరెడ్డి, కొండాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ రమేష్, కొండాపూర్ డివిజన్ సెక్రెటరీ రాజేందర్ నాయక్, కూకట్పల్లి డివిజన్ ప్రెసిడెంట్ రామ్ చందర్, సెక్రెటరీ ఎస్. రమేష్, గచ్చిబౌలి డివిజన్ సెక్రెటరీ బి. దుర్గాప్రసాద్, కూకట్పల్లి డివిజన్ సెక్రెటరీ ఎం.బాల సిద్దు, ఎం.మల్లేష్ పాల్గొన్నారు.
