శేరిలింగంపల్లి, జూన్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి 16 ఫిర్యాదులు రాగా, ఇంజినీరింగ్ వింగ్కు 1 మొత్తం కలిపి 17 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు.






