హైదర్‌నగర్‌లో జూన్ 27న విద్యుత్ అంతరాయం

శేరిలింగంపల్లి, జూన్ 26 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): నిర్వహణ పనుల దృష్ట్యా శనివారం (జూన్ 27) హైదర్‌నగర్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో నిర్ణీత సమయాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు హైదర్‌నగర్ ఆపరేషన్ ఏఈ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మయూరి నగర్ సబ్‌స్టేషన్‌కు చెందిన 11 కేవీ గోకరాజు రంగరాజు ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నారు. ఈ సమయంలో గోకరాజు కాలేజీ రోడ్డు, విజ్ఞాన్ స్కూల్ పరిసర ప్రాంతాలు ప్రభావితమవుతాయి. అలాగే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు మయూరి నగర్ సబ్‌స్టేషన్‌కు చెందిన 11 కేవీ బాలాజీ నగర్ ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నారు. ఈ సమయంలో బాలాజీ నగర్ కాలనీ, ఆర్‌ఎల్ సిటీ, వెంకట్‌రాయ్ నగర్ కాలనీ వెనుక ప్రాంతాలు విద్యుత్ అంతరాయానికి గురికానున్నాయి. నిర్వహణ పనుల కారణంగా వినియోగదారులకు కలిగే అసౌకర్యానికి విద్యుత్ శాఖ విచారం వ్యక్తం చేస్తూ, ప్రజలు సహకరించాలని ఏఈ విజ్ఞప్తి చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here