శేరిలింగంపల్లి, జూన్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి చందానగర్ లో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ పోరాటంలో అమరులైన పోరాట యోధులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధించి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఆత్మగౌరవం కోసం మరొక సామాజిక ఉద్యమం చేయాలని అన్నారు. సమాజంలో మేమెంతో మాకంత అనే నినాదంతో ప్రతి ఒక్కరికి సమాన వాటా కల్పిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరికీ వెనుకబడిన కులాలకు దామాషా పద్ధతిన రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఒంగోరు శ్రీనివాస్ యాదవ్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, శేరిలింగంపల్లి బీసీ సంఘాల అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ, మియాపూర్ బిసి సంఘం అధ్యక్షుడు నర్సింగ్ ముదిరాజ్, సీనియర్ బీసీ నాయకులు డాకయ్య గౌడ్, నాయి బ్రాహ్మణ సంఘం అశోక్, రజక సంఘం కిషోర్, మున్నూరు సంఘం వినోద్, బిసి మహిళా సంఘాల నాయకులు, యువజన నాయకులు పాల్గొన్నారు.