ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటాం: కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లవేళలా ముందుంటామని హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్ అన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని సాయి రామ్ కాలనీలో స్థానికులతో కలిసి కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పూజితజగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా పనిచేస్తామని చెప్పారు. అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని, యూజీడీ, సీసీ రోడ్లు, వీధి లైట్లు తదితర వాటన్నింటిని సమకూరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సాబేర్, మొహమ్మద్, హుస్సేన్, మల్లేష్, సృజన, తాజు బేగం తదితరులు పాల్గొన్నారు.

సాయిరాం కాలనీలో యూజీడీ పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here