ఆదిత్యనగర్ లో కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పాదయాత్ర

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ లో చందానగర్ డిప్యూటీ కమిషనర్ సుదాంశు, ఈఈ శ్రీకాంతి తో కలిసి కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పాదయాత్ర చేశారు. స్థానికంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. సమస్యల పరిష్కారానికి దశల వారీగా నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఏఈ ప్రశాంత్, శానిటేషన్ సూపర్ వైజర్ శ్రీనివాస్, ఆదిత్య నగర్ టీఆర్ఎస్ బస్తీ అధ్యక్షుడు మునాఫ్ ఖాన్, మహిళా అధ్యక్షురాలు బుజ్జమ్మ, మాదాపూర్ డివిజన్ మైనారిటీ అధ్యక్షులు రహీమ్, మైనారిటీ నాయకులు బాబుమియా, మనికప్ప, సలీం, యూత్ బస్తి అధ్యక్షుడు ఖాజా, బస్తీ మహిళా గౌరవ అధ్యక్షురాలు పర్వీన్, యూత్ నాయకులు బష్రత్, ఇమ్రాన్, మాదాపూర్ డివిజన్ మహిళా కమిటీ జనరల్ సెక్రెటరీ స్నేహ, శానిటేషన్ ఎస్సార్పీ మహేష్, వర్క్ ఇన్‌స్పెక్టర్ మల్లేష్, ఎస్ఎఫ్ఏ ప్రసాద్, చిన్న తదితరులు పాల్గొన్నారు.

డీసీ సుదాంష్ తో కలిసి ఆదిత్య నగర్ లో పాదయాత్ర చేస్తున్న కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here