శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని వివిధ కాలనీలలో సంవత్సరాలుగా పేరుకుపోయిన రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మంగళవారం ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి ఆయా సమస్యల వివరాలను మంత్రి కేటీఆర్కు అందజేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో గాంధీ ఆయా సమస్యలకు చెందిన సమగ్ర వివరాలను నివేదిక రూపంలో మంత్రి కేటీఆర్కు అందజేశారు.
