శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పలు సమస్యలపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ వినతి పత్రం అందజేశారు. బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ క్లబ్ హౌజ్ లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ ను శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కలిసి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ముఖ్యంగా రాజీవ్ గృహకల్పలో పేరుకుపోయిన నీటి సరఫరా విద్యుత్ బకాయి బిల్లులను, నీటి బకాయి బిల్లులను మాఫీ చేసేలా చూడాలని మంత్రి కేటీఆర్ ను కోరారు.