శేరిలింగంపల్లి, మే 6 (నమస్తే శేరిలింగంపల్లి): ఏ ఐ ఎఫ్ డి ఎస్ గ్రేటర్ హైదరాబాద్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా కన్వీనర్ ముత్తన్న శ్రీకాంత్ అధ్యక్షతన తాండ్ర రామచంద్రయ్య భవన్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య(ఏ ఐ ఎఫ్ డి ఎస్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పల్లె మురళి, గడ్డం నాగార్జున హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా గ్రేట్ హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ కళాశాలలు సమ్మర్ క్లాసులు నిర్వహించడం సిగ్గుచేటని, ఎన్నిసార్లు ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖ అధికారికి కంప్లైంట్ చేసిన పట్టించుకోక పోగా వారితో లోపాయికారీ ఒప్పందం చేసుకొని సపోర్ట్ చేస్తున్న డిఐఈఓని తక్షణమే సస్పెండ్ చేసి సమ్మర్ క్లాసులు నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సమ్మర్ క్లాసుల వల్ల విద్యార్థిని విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురై చదువుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. సమ్మర్ హాలిడేస్ మానసికంగా ఉల్లాసంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వేసవి సెలవులలో క్లాసులు నిర్వహించడం బాధాకర విషయం అని, రాష్ట్రవ్యాప్తంగా సమ్మర్ క్లాసులు నిర్వహిస్తున్న కళాశాలల పర్మిషన్ రద్దుచేసి తక్షణమే ఆ కళాశాలల యాజమాన్యంపై చట్టరీత్యా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అరుణ్, వేణు, ప్రశాంత్, పవన్, రాజేష్, సన్నీ, వంశీ, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.