శేరిలింగంపల్లి, మే 6 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్పల్లి మండలం పరిధిలోని వివేకానంద నగర్, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ , కూకట్పల్లి (పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా మంజూరైన రూ.30,03,480 ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు వివేకానంద నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్ లతో కలిసి చెక్కుల రూపేణా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, అక్తర్, MD ఇబ్రహీం, సమ్మారెడ్డి, ఖాసీం, మహమ్మద్ బేగ్, మోజేశ్, అష్రాఫ్, కరీం, నర్సయ్య, మంజుల, జుబేదా బేగం, లబ్ధిదారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.