శేరిలింగంపల్లి, మే 6 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీకి నూతనంగా ఎన్నుకోబడిన అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకో బడిన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీ అసోసి యేషన్ వాసులు కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఏ చిన్న సమస్య అయినా తన దృష్టికి గాని తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని, నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గసభ్యులు కాలనీ వాసులందరికీ ఎల్లవేళాలా అందుబాటులో ఉంటూ సమస్యల పై స్పందిస్తూ ప్రతి ఒక్కరూ సమిష్టిగా కలిసి అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీ అధ్యక్షుడు మోహన్ రావు, కార్యవర్గ సభ్యులు కోటి రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, అంజయ్యా, సూర్యనారాయణ, బసవేశ్వరావు, జీవన్, సీతాకుమారి, మంజుల, జగదీశ్వర్ రావు, లక్ష్మారెడ్డి, మోహన్ రెడ్డి, శైలేష్ రెడ్డి, శ్రీధరాచారి, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.