శేరిలింగంపల్లి, ఫిబ్రవి 11 (నమస్తే శేరిలింగంపల్లి): వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం ఆడిట్ పేరాలపై అసెంబ్లీ భవనాల కమిటీ హాల్ నెం.1లో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అధ్యక్షతన జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో సభ్యులు టి.భాను ప్రసాదరావు, రేవూరి ప్రకాష్ రెడ్డి, అహ్మదిబిన్ అబ్దుల్లా బాలల, అకౌంటెంట్ జనరల్ పి. మాధవి, అసెంబ్లీ లెజిస్లేచర్ డాక్టర్.వి నర్సింహా చార్యులు, వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అన్నారు. పేద ప్రజలు ఎవరు వైద్యం కోసం ఇబ్బది పడవద్దు అని, ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య పరీక్షల కోసం వచ్చే వారికి అన్ని రకాల వసతులు కల్పించాలని అన్నారు. వైద్య పరీక్షలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగేలా చూడాలని, వైద్య పరీక్షల కోసం వాడే పరికరాల వాడకం, నిర్వహణ సక్రమంగా చూడాలని, నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు.
అన్ని పరీక్షలు ఒకే చోట జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణను మెరుగుపచాలని , బస్తీ దవాఖానలలో వైద్య నిర్వహణ పనితీరు మెరుగుపర్చాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందేలా కృషి చేయాలని, నిత్యం పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఆడిట్ పేరా 3.7 క్రియ రహిత పరికరాలు, ఆడిట్ పేరా 3.5 మానసిక ఆరోగ్య సంస్థలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటు గురించి, ఆడిట్ పేరా 3.4 రక్త భాగాల కారకాల యూనిట్ల పనితీరు , ఆడిట్ పేరా 3.10 పీజీ సీట్ల పెంపు కోసం, ప్రభుత్వ కళశాల బలోపేతం, ఉన్నతీకరణ చేయడం , ఆడిట్ పేరా 3.11 పనిచేయని మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ ల గూర్చి సవివరంగా చర్చించారు.