పెండింగ్‌లో ఉన్న ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్ ల‌తో కలిసి PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని, పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడలని, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని, అవసరమైతే ముఖ్యమంత్రివ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అధిక మొత్తంలో నిధులు మంజూరు అయ్యేలా కృషి చేయాల‌ని అన్నారు. పనులలో వేగం పెంచాలని, సకాలంలో నిధులు మంజూరు అయ్యేలా చూడాలని, అభివృద్ధి పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. ఈ అంశాలపై జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించార‌ని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జోన‌ల్ క‌మిష‌న‌ర్ ఉపేంద‌ర్ రెడ్డితో చ‌ర్చిస్తున్న ఎమ్మెల్యే గాంధీ

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here