ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిలో గుర్తించే ప్ర‌తి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాం: మాదాపూర్ కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని బిక్షపతి నగర్‌, సాయిన‌గ‌ర్‌ల‌లో శుక్ర‌వారం పట్టణ ప్రగతి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అధికారులు డిఈ రూపా దేవి, ఏఈ ప్రశాంత్, జ‌ల‌మండ‌లి మేనేజర్ నివర్థీల‌తో క‌ల‌సి స్థానిక కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ స్థానికంగా పర్యటించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ డివిజన్ పరిధిలోనీ బస్తిల్లలో/కాలనీలలో ఉన్న చెత్తను తొలగించడం, డ్రైనేజీ వ్యవస్థను శుభ్ర పరచడం, మురికి నీటి గుంతలను తొలిగించి పరిసరా ప్రాంతాలను పరిశుభ్రంగా చేయటమే లక్ష్యంగా పట్టణ ప్రగతి నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలోఈ కార్యక్రమంలో నాయకులు మహేష్, చోటేమియ, దుర్గేశ్, ఎండీ.నయీం, రాజు, శేఖర్, దేవాయ్యా, కృష్ణ, విశ్వనాథ రెడ్డి, భీమయ్య, అహ్మద్, అసిస్టెంట్ ఎంటోమోలోజిస్ట్ గణేష్, శానిటేషన్ ఎస్ఆర్‌పీ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఎఫ్ఏ ప్ర‌సాద్, నందు, ఎలక్ట్రికల్ సిబ్బంది ప్రేమ్‌ తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌, అధికారుల‌కు స‌మ‌స్య‌ల‌ను వివ‌రిస్తున్న మాదాపూర్ సాయిన‌గ‌ర్ వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here