పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి – చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని పద్మజ నగర్, రాజేంద్ర నగర్, సిటిజన్ కాలనీ, శివాజీ నగర్, వీకర్ సెక్షన్ కాలనీలో చందానగర్ డివిజన్ ర్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి పర్యటించారు. కాలనీలలో నెలకొన్న సమస్యలను ప్రజలను తెలుసుకున్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా రోడ్ల పై, ఖాళీ స్థలంలో ఉన్న వ్యర్థాలను జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయంతో తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాలనీ వాసులకు కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, ఎస్ఈ శంకర్ నాయక్, ఈఈ శ్రీకాంతి, వాటర్ వర్క్స్ మేనేజర్ సునిత, ఎలక్ట్రికల్ ఏఈ రమేష్, శానిటేషన్ విభాగం అధికారులు బాలాజీ, గంగిరెడ్డి, వర్క్ ఇన్‌స్పెక్టర్ జగన్, టీఆర్ఎస్ నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

పట్టణ ప్రగతిలో రోడ్లపై పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగింపజేయిస్తున్న చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here