పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి – మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: పట్టణ ప్రగతి కార్యక్రమంలో మౌలిక వసతుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని, ప్రతిఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ఐదో విడత పట్టణ ప్రగతిలో భాగంగా హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని గంగారాం లో, మాదాపూర్ డివిజన్ పరిధిలోని నవభారత నగర్ నగర్ లో ఆయా శాఖల అధికారులతో కలిసి కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పర్యటించారు.

హఫీజ్ పేట్ డివిజన్ లో చేపట్టిన పట్టణ ప్రగతిలో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

పట్టణ ప్రగతిలో పారిశుద్ధ్య పరిరక్షణ, పచ్చదనం పరిశుభ్రతపై శ్రద్ధ వహించి రోడ్డుపై చెత్తాచెదారం లేకుండా‌ చూడాలని సంబంధిత ‌అధికారులకు సూచించారు. ఆయన వెంట డీఈ సురేష్, ఏఈ ప్రతాప్, వాటర్ వర్క్స్ మేనేజర్లు సుబ్రమణ్యం, నివర్థీ, ఎలక్ట్రికల్ డీఈ సునీల్, ఏఈ రామ్మోహన్, ఎస్ ఆర్ పీ లు మహేష్, శ్రీనివాస్ రెడ్డి, ప్రసాద్, ఎంటమాలజీ గణేష్, నాయకులు శేఖర్ ముదిరాజ్, రవి కుమార్, భగత్ ముదిరాజ్, నవభారత నగర్ బస్తి అధ్యక్షుడు సాదిక్, ఎస్సీ సెల్ అధ్యక్షులు కంది జ్ఞానేశ్వర్, చిన్న, అనిల్, వీరేందర్, నురుద్దిన్, షేక్ అలీ, వెంకటేష్, శ్రీనివాస్ గౌడ్, ఎండి అంజద్ ఖాన్, భషీర్, అంజద్ అలీ, హఫీజ్, కరణ్,‌ ఆయుబ్ పటేల్, ఆఫ్రోజ్, యాదగిరి, రఫీక్, గఫూర్, మహిళలు సావిత్రి, మీన, రాములమ్మ, కొండమ్మ, గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు.

మాదాపూర్ డివిజన్ లో పట్టణ ప్రగతి కరపత్రాన్ని విడుదల చేసిన కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here