హ‌జ్ యాత్ర‌కు వెళ్తున్న ముస్లింల‌కు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శుభాకాంక్షలు

శేరిలింగంప‌ల్లి, మే 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి నివాసంలో హజ్ యాత్రకు వెళుతున్న ముస్లింలకు కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ హజ్ యాత్ర వెళ్తున్న యాత్రికుల ప్రయాణం సురక్షితంగా సఫలంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాన‌ని అన్నారు. ఆ అల్లాహ్ దయతో అందరూ హజ్ యాత్ర సంపూర్ణం చేసుకోవాలని కోరుకుంటున్నాన‌ని అన్నారు. ఆ అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హజ్ యాత్ర కు వెళ్లే యాత్రికులు అక్తర్, అక్బర్ ఖాన్, ఖలీదు, నమీమ్, షమీ, నాయకులు రఘునాథ్ రెడ్డి, నరేందర్ బల్లా, అంజద్ పాషా, యూసఫ్ పాషా, అలీ, ఖలీద్ పాషా, సాజిద్, షఫీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here