శేరిలింగంపల్లి, అక్టోబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): దసరా పండుగ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, నాయకులు మారబోయిన రాజు యాదవ్, జనార్దన్ రెడ్డి, అక్తర్, ప్రసాద్, చింతకింది రవి, కొండల్ రెడ్డి, నగేష్, బాబు తదితరులు పాల్గొన్నారు.






