న‌ల్ల‌గండ్ల‌లో మళ‌యాళీ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఓనం వేడుకలు

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 21 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్లలో మళ‌యాళీ అసోషియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మానస్ 2025 ఓనం పర్వదిన వేడుకలలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఓనం పర్వదినం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, ఓనం పర్వదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని , చాలా పవిత్రమైన పర్వదినం అని PAC చైర్మన్ గాంధీ తెలియజేశారు. అన్ని వేళళ్లో ప్ర‌జ‌ల‌కు అండగా ఉంటానని, ప్ర‌జ‌ల అభ్యున్నతికి ఎల్లవేళలా కృషి చేస్తానని, తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ, విష్ణు వర్ధన్ రెడ్డి, వేణు గోపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, హరిదాస్ మనికొత్, KR జయనారాయణ్‌, అతుల్ నాథ్, KP విశాల్, ప్రియ కే.ప్రసాద్, లక్ష్మీ, అదితి ఆనంద్, రాధిక వివేక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here