బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా గూడూరి త్రినాథ్

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి ఓబిసి మోర్చ‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా శేరిలింగంపల్లి కి చెందిన త్రినాథ్ ను నియమిస్తూ ఓబీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్ రాజు శనివారం నియామకపు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలె భాస్కర్ రాజ్ మాట్లాడుతూ బీజేపీ పటిష్టానికి కృషి చేయాలని అన్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఎప్పుడూ లేని విధంగా ఓబీసీ వర్గానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. గూడూరి త్రినాథ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ రాజుకు, ఉపాధ్యక్షుడు నందనం దివాకర్, జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కరరెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచమల్ల నాగేశ్వర గౌడ్, రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ నాయకులకు ప్ర‌త్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఓబీసీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా త్రినాథ్ కు నియామకపు పత్రాన్ని అందజేస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ రాజు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here