విద్యాభ్యాసంతోనే విద్యార్థుల అభ్యున్నతి – మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: విద్యాభ్యాసంతోనే విద్యార్థుల్లో అభ్యున్నతి సాధ్యమని మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ అన్నారు. సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాదాపూర్ ప్రభుత్వ పాఠాశాలలో ఉచిత నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థినీ విద్యార్థులకు ట్రస్ట్ చైర్మన్ బిక్షపతి యాదవ్, ట్రస్ట్ సెక్రెటరీ రవి కుమార్ యాదవ్ చేతుల మీదుగా బుక్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా బిక్షపతి యాదవ్ మాట్లాడుతూ విద్యతోనే అన్ని రంగాల్లో రాణించగలరని, కష్టపడి చదివి గురువులకు , తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సందయ్య ట్రస్ట్ తరపున నోట్ బుక్స్ పంపిణీ చేస్తున్నామని, మున్ముందు రాబోయే రోజుల్లోనూ ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుందన్నారు. గత సంవత్సరం పదో తరగతి విద్యార్థులకు అందజేసిన స్టడీ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడిందని, ఈ సంవత్సరం కూడా స్టడీ మెటీరియల్ అందిజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వెంకటేష్ యాదవ్, శాస్త్రి యాదవ్, రాధాకృష్ణ యాదవ్, రఘునాథ్ యాదవ్, ఆంజనేయులు సాగర్, గోపాల్ ముదిరాజ్, శ్రీనివాస్, మధు యాదవ్, గోవర్ధన్ రెడ్డి, సురేష్, నాగార్జున యాదవ్, గణేష్ , శీను, అశోక్, రవి, రాము తదితరులు పాల్గొన్నారు.

మాదాపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here