పొగాకు వ్యతిరేక దినోత్సవం గోడ ప‌త్రిక ఆవిష్క‌ర‌ణ

శేరిలింగంప‌ల్లి, మే 31 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ముద్రించిన పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగం వలన వచ్చే ఆరోగ్య సమస్యలతో పాటు జరిగే అనర్థాలను తెలియజేసే గోడ పత్రిక (స్టిక్కర్) ను ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన మియాపూర్ ఏసీపీ సి.హెచ్. వై శ్రీనివాస కుమార్ గోడ పత్రికను ఆవిష్కరించి మాట్లాడుతూ 31మే 1988 నుండి ప్రపంచ ఆరోగ్య సంస్థవారు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఒక నినాదంతో నిర్వహిస్తున్నార‌ని తెలిపారు. ఈ సంవత్సరపు నినాదం అప్పీలును బహిర్గతం చేయడం : పొగాకు పరిశ్రమ వ్యూహాలను బహిర్గతం చేయడం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పొగాకు, పొగాకు ఉత్పత్తుల వలన ప్రజలకు, ప్రజారోగ్యానికి, సమాజానికి, పర్యావరణానికి కలిగే హాని గురించి అవగాహన పెంచడమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మారబోయిన సదానంద యాదవ్, స‌భ్యులు జనార్ధన్, పాలం శ్రీను, అమ్మయ్య చౌదరి, శివరామకృష్ణ. వాణిసాంబశివరావు, ప్రేమసింగ్, జిల్ మల్లేష్ , శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here