శేరిలింగంపల్లి, మే 31 (నమస్తే శేరిలింగంపల్లి): స్థానిక సంస్థల్లో బీసీలకు 42% శాతం రిజర్వేషన్స్ కేటాయించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ MP ఆర్ కృష్ణయ్య, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% శాతం రిజర్వేషన్స్ కల్పించిన తర్వాతే ఎలక్షన్లు నిర్వహించాలన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణ పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి పూర్తి ఫీజులను ప్రభుత్వం భరించాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి దొంతిబోయిన శ్రీనివాస్ యాదవ్, కృష్ణ చారి, రమేష్ గౌడ్, సురేష్ ముదిరాజ్, రజక సంఘం వెంకటేష్, నాయి బ్రాహ్మణ సంఘం అశోక్, శేరిలింగంపల్లి మండల్ బీసీ సంఘం అధ్యక్షుడు మాధవరావు, గొల్ల ప్రసాద్ యాదవ్, వేణుగోపాల్, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.