శేరిలింగంపల్లి, మే 16 (నమస్తే శేరిలింగంపల్లి): తారానగర్ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం (మే 17, 2025) విద్యుత్ సరఫరాను నిలిపివేయడం జరుగుతుందని ఏఈ ఒక ప్రకటనలో తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్ 11 కెవి ఫీడర్ పరిధిలో ఉన్న సబ్ స్టేషన్, శాంతినగర్, రఘుపతి రెడ్డి ఇళ్లు, కడిమి హాస్పిటల్. హుడా కేఫ్ మెయిన్ రోడ్డులో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంటు ఉండదని తెలిపారు. ఆర్టీసీ కాలనీ 11కెవి ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాయిబాబా ఆలయం, ఎంఎంటీఎస్ ట్రాక్ రోడ్డు వద్ద కరెంటు ఉండదని అన్నారు. వినియోగదారులు విద్యుత్ సరఫరాలో అంతరాయాన్ని గమనించి సహకనించాలని కోరారు.