శేరిలింగంపల్లి, ఏప్రిల్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి లో నూతనంగా ఏర్పాటు చేసిన భారత్ పెట్రోల్ బంక్ ను యజమానులు, స్థానిక కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పీఏసీ చైర్మన్,శేరిలింగంపల్లి శాసన సభ్యుడు ఆరెకపూడి గాంధీ, శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ప్రజా సేవతో పాటు పదిమంది కి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వ్యాపారాన్ని వృద్ధి చేయడం కోసం గంగాధర్ రెడ్డి చేస్తున్న సేవలు అభినందనియమని తెలిపారు.
ప్రజా సేవలో రాణించినట్లే వ్యాపారం లో కూడా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో బీపీసీఎల్ హైదరాబాద్ చెర్లపల్లి, టెరిటరీ మేనేజర్ గురు రాజ్ సాంచ్, టెరిటరీ కో ఆర్డినేటర్ కార్తీక్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పల పాటి శ్రీకాంత్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘననాధ్ రెడ్డి, పలువురు ప్రముఖులు సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, బీజేపీ శ్రేణులు, భక్తులు, గోపనపల్లి గ్రామం వాసులు, మహిళలు, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.